మధుర నాయకులు.

విశ్వనాథనాయకుని తర్వాత అతని కుమారుడు కృష్ణప్పనాయకుడు పాలించాడు. క్రీ.శ 1602-1609 వరకు ముద్దు కృష్ణప్ప, 1609 నుంచి 23 వరకు ముద్దు వీరప్ప పరిపాలించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముద్దు వీరప్ప కుమారుడు తిరుమల నాయకుడు మంచి పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన తిరుమలరాయ మహల్ని నిర్మించి, తెలుగు భాషని, సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. తిరుమల నాయకుడి కుమారుడు చొక్కనాథుని కాలంలో నాయక రాజ్య పతనం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత వచ్చిన విజయరంగ చొక్కనాయకుడు చిన్నపిల్లవాడు కావడంతో అతని అమ్మమ్మ రాణి మంగమ్మాళ్ రాజ్యపాలన చేసింది. విజయరంగ చొక్కనాథుడు యుక్తవయసుకు వచ్చిన తర్వాత పాలన బాధ్యతలను చేపట్టాడు. అతడి తర్వాత అతని భార్య రాణి మీనాక్షి రాజ్యాధికారాన్ని చేపట్టింది. స్ర్తీల అధికారాన్ని భరించలేని ఆ రాజ్యంలోని కొందరు ఆమెపై కుట్ర పన్నారు. దాంతో ఆర్కాట్ పాలకుడు చాంద్ సాహెబ్ మధురపై దండెత్తి, ఆర్కాట్ రాజ్యంలో కలుపుకున్నాడు. లొంగిపోవటం ఇష్టం లేని మీనాక్షి ఆత్మత్యాగం చేసుకుంది.
భారతదేశ నదులు.

హిమాలయ నదుల్లోని సింధునది వలనే మన దేశానికి హిందూదేశం అని పేరు వచ్చింది. సింధునది టిబెట్లోని మానస సరోవర్ దగ్గర కైలాస శిఖరంలో పుట్టి హిమాలయాల మీదుగా పాకిస్థాన్ గుండా ప్రవహించి కరాచీ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. గంగానది హిమాలయాల్లోని గంగోత్రి దగ్గర పుట్టి ఉత్తరప్రదేశ్, బీహర్, బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
బ్రహ్మపుత్ర నది మానస సరోవర్లో జన్మించి టిబెట్, అరుణాచల్ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దక్కన్ నదుల్లో మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న... లాంటి నదులు తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. నర్మద, తపతి, శరావతి, నేత్రావతి నదులు పశ్చిమదిక్కుగా ప్రవహిస్తాయి. తూర్పు వైపుకు ప్రవహించే నదులు పడమటి కనుమల్లో పుట్టి దక్కన్ పీఠభూమికి అడ్డంగా, తీరమైదానాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. పశ్చిమ వైపుకు ప్రవహించే నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి.
వైరస్ అంటే ఏమిటి?

దాని శక్తి కోసం ఇతర జీవకణాల మీదకు దాడి చేస్తుంది.ఒకసారి ఒక కణంలోకి వైరస్ ప్రవేశిస్తే ఆ కణంలో మరి కొన్ని వైరస్లు పుట్టుకొస్తాయి. అవి కణంలోని గోడలను దెబ్బతీసి శరీరంలోని అన్ని కణాలకు వ్యాపిస్తాయి. అందుకే మనుషులకు, జంతువులకు అనారోగ్యం ఏర్పడుతుంది. మొక్కల్లో కూడా అనేక తెగుళ్ళు రావటానికి కారణం వైరస్. ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన రోగాలు వైరస్ల వల్లే వస్తాయి.

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల్లో ఆచార్య జె.బి. కృపలానీ ఒకరు. ఆయన గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణ వేత్త. ఆయన మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడు. సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి ఎమర్జెన్సీ కాలం వరకు దేశ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న నేత. కృపలానీ నాటి సింధు (నేటి పాకిస్తాన్) ప్రాంతంలోని హైదరాబాద్లో 1888లో జన్మించారు. ఇతడి పూర్తిపేరు జీవిత్రాయ్ భగవాన్ దాస్ కృపలానీ. ఆయన కరాచీలోని డి.జె.సైన్స్ కాలేజీలో చదువుకునే రోజుల్లో... రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నందుకు ఆయనను కాలేజీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ముంబై ఫెర్గూసన్ కాలేజీలో విద్యనభ్యసించి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగటంతో కృపలానీ కూడా దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమాల్లో పాల్గొన్నాడు.
కృపలానీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటూనే గుజరాత్, మహారాష్ర్టలోని గాంధీ ఆశ్రమాలలో సంస్కరణ, విద్యా సంబంధ విషయాలపై కృషి చేశాడు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగే అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కృపలానీ అనేకసార్లు జైలుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాడు. క్లిష్టమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరికొందరు నేతలతో కలిసి ‘కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ’ని స్థాపించారు. ఆ తర్వాత దానిని సోషలిస్టు పార్టీలో విలీనం చేసి ప్రజా సోషలిస్టు పార్టీ’గా పేరు మార్చారు. కృపలానీ జీవితాంతం నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనా విధానాల విమర్శకునిగా మిగిలిపోయాడు. ఆయన భార్య సుచేతా కృపలానీ అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గంలో పదవులతో సహా అనేక ఉన్నత పదవులు పొందారు. కృపలానీ 1982 మార్చి 19న మరణించారు.
కృపలానీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటూనే గుజరాత్, మహారాష్ర్టలోని గాంధీ ఆశ్రమాలలో సంస్కరణ, విద్యా సంబంధ విషయాలపై కృషి చేశాడు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగే అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కృపలానీ అనేకసార్లు జైలుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాడు. క్లిష్టమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరికొందరు నేతలతో కలిసి ‘కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ’ని స్థాపించారు. ఆ తర్వాత దానిని సోషలిస్టు పార్టీలో విలీనం చేసి ప్రజా సోషలిస్టు పార్టీ’గా పేరు మార్చారు. కృపలానీ జీవితాంతం నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనా విధానాల విమర్శకునిగా మిగిలిపోయాడు. ఆయన భార్య సుచేతా కృపలానీ అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గంలో పదవులతో సహా అనేక ఉన్నత పదవులు పొందారు. కృపలానీ 1982 మార్చి 19న మరణించారు.
జాన్ కీట్స్

స్కూలు చదువు పూర్తయిన తర్వాత కీట్స్ ఒక సర్జన్ దగ్గర అప్రెంటిస్గా చేరాడు. అది పూర్తయిన తర్వాత కీట్స్ 1815 అక్టోబర్లో గైస్ హాస్పిటల్ (ఇది ప్రస్తుతం లండన్ కింగ్స్ కాలేజ్లో భాగం)లో వైద్య విద్యార్థిగా తన పేరు నమోదు చేసుకున్నాడు.
చేరిన నెలరోజుల్లోపే డ్రెసర్షిప్ హోదాకి అంటే జూనియర్ హౌస్సర్జన్తో సమానమైన స్థాయికి చేరాడు. కొంతకాలం ఆస్పత్రులలో సర్జన్లకి సహాయకునిగా పనిచేశాడు. దానితో కీట్స్కి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయని అందరూ భావించారు. కానీ సాహిత్యం పట్ల మమకారం పెరగడంతో చేస్తున్న వృత్తిని వదిలి పెట్టి పూర్తిగా కవిత్వానికే అంకితమయ్యాడు.
కీట్స్ మొదటి కవిత ‘యాన్ ఇమిటేషన్ ఆఫ్ స్పెన్సర్’. దీనిని కీట్స్ 1814లో తన పందొమ్మిదవయేట రాశాడు. ‘ఓడ్ టు ఏ నైటింగేల్’, ఇసాబెల్లా, టు ఆటమ్న్, ‘లామియా’,‘ హైపరియాన్’,‘ ది ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్’ లాంటి పుస్తకాలెన్నో రచించాడు.
అందరికీ సుపరిచితమైన ‘‘ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫరెవర్’’ అనే కొటేషన్ కీట్స్ రాసిన కవిత్వంలోనిదే. తన తల్లినీ, సోదరుడినీ కబళించిన క్షయ వ్యాధితో పోరాడి పోరాడి 1821 ఫిబ్రవరి 23న కీట్స్ చనిపోయాడు. కీట్స్ జీవితకాలం పాతికేళ్లే అయినప్పటికీ, వందేళ్లు గడిచినా మరిచిపోలేని అద్భుత కవిత్వాన్ని సృష్టించిన కవిగా చరిత్రలో నిలిచిపోయాడు.
నన్నె చోడుడు
నన్నెచోడుడు శైవకవుల్లో మొదటివాడు. రాజ కవి. ఆయన క్రీ.శ. 12వ శతాబ్దానికి... అంటే నన్నయ్య, తిక్కనల మధ్య కాలానికి చెందిన వాడు. నన్నెచోడుడు రచించిన కుమార సంభవం అనే కావ్యం బాగా ప్రసిద్ధి చెందింది. కుమార సంభవం నుంచి తెలుగు సాహిత్యంలో శైవ మత ప్రధానమైన రచనలు వ్యాప్తిలోకి వచ్చాయి. తెలుగు, సంస్కృత పదాలను మేళవించి ఉపయోగించిన తొలి కవి, తెలుగు సాహిత్యంలో కన్నడ, తమిళ పదాలను చేర్చిన వాడు ఇతడే. మార్గ-దేశి, జాను తెనుగు, వస్తు కవిత అనే పద ప్రయోగాలను చేశాడు.
నన్నెచోడుని కుమారసంభవం కాళిదాసు రాసిన కుమారసంభవానికి యథాతథ అనువాదం కాదు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. శివ, స్కాంద, వాయు, బ్రహ్మండ పురాణాల్లోనూ, భారత రామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న వాటినే ప్రబంధంగా మలిచాడు. ఆయన కుమార సంభవంలో ‘దేశి-మార్గములను దేశీయములుగా చేయవలను’ అని పేర్కొన్నాడు. అందులోని గజానన వృత్తాంతం నన్నెచోడుని దేశీయ అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆయన తన కావ్యం రత్నపుత్రిక వంటిదని కొనియాడాడు. అలాంటి కృతులు రచించటానికి కవికి అరవైనాలుగు విద్యల్లో నేర్పు ఉండటం అవసరమని ఆనాటి కవుల అభిప్రాయం. కవిత్వం సౌందర్యంగా, సుకుమారంగా, హృదయానికి నచ్చే విధంగా ఉండాలని నన్నెచోడుని అభిప్రాయం. ప్రతి పద్యం విశిష్టంగా ఉండాలని సూచించాడు. సుకవి స్తుతి, కుకవి నింద, ఇష్టదేవప్రార్థన ఇతడి ఇతర రచనలు.
నది ఒడ్డున నీళ్లు వేగంగా ఎందుకు ప్రవహించవు?
నదిలోకి స్నానం చెయ్యడానికో, ఈత కొట్టడానికో వెళ్లినప్పుడు... నదిని పరిశీలిస్తే ఒక విషయాన్ని గమనించవచ్చు. నది మధ్యలో నీటివేగం ఎక్కువగా, ఒడ్డు దగ్గర మంద్రంగా ప్రవహించడాన్ని చూడవచ్చు. దీనికి కారణం ఏమిటంటే.. నీరు అతి పలుచని ద్రవం. ప్రవహించటం దాని ప్రధాన గుణాల్లో ఒకటి.
నేల చదరంగా విస్తరించిన కాగితంలా పల్లం వైపు వ్యాపిస్తున్నప్పుడు, అంటే నది నీరు గట్టుకి దగ్గరవుతున్న కొద్దీ ఆ నీటికి ఒత్తిడి, రాపిడి ఏర్పడతాయి. కారణం ఇరువైపులా ఒడ్డు దగ్గర నేల లోతు తక్కువగా ఉండటమే. ఈ ఒత్తిడి, రాపిడి ఒడ్డు దగ్గర ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అక్కడ నీరు వేగంగా ప్రవహించలేదు. అదే నది మధ్య భాగాన ఒత్తిడి, రాపిడి ప్రభావం ఉండదు. అందుకే అక్కడ నీరు వేగంగా ప్రవహించగలుగుతుంది.
ఒకప్పుడు మహిళలకి ఓటుహక్కు ఉండేది కాదు. ఆ మాటకొస్తే ఇప్పటికీ కొన్ని దేశాల్లో మహిళలకి ఓటుహక్కు లేదు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1880లో ‘ది ఐల్ ఆఫ్ మ్యాన్’ అనే ఐలాండ్లో మహిళలకి ఓటు హక్కు కల్పించారు. అయితే ఈ ఐలాండ్ ఒక దేశం కాదు, యునెటైడ్ కింగ్డమ్లో ఒక భాగం మాత్రమే. 1893లో న్యూజిలాండ్లో మహిళలకి ఓటుహక్కు ఇచ్చారు. 1920 వరకు మహిళలకి ఓటుహక్కుని ఇచ్చిన యూరోపియన్ దేశాలు రెండు మాత్రమే. 1919లో స్వీడన్లో, 1920లో చెకోస్లవేకియాలో మహిళలకి ఓటుహక్కు వచ్చింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా 1920లోనే మహిళలకి ఓటుహక్కుని ప్రకటించారు. అయితే అప్పటికే అక్కడ కొన్ని రాష్ట్రాల్లో అది అమలులో ఉంది. 1945 వరకు ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో మహిళలు ఓటు వేసే అవకాశం లేదు. 1971 వరకు స్విట్జర్లాండ్లో, 1984 వరకు లిచెన్స్టీన్లో మహిళలకి ఓటుహక్కు లేదు. కువైట్లో అయితే 2005 వరకు కూడా ఓటు వేయడానికి మహిళలని అనుమతించలేదు.
నన్నెచోడుని కుమారసంభవం కాళిదాసు రాసిన కుమారసంభవానికి యథాతథ అనువాదం కాదు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. శివ, స్కాంద, వాయు, బ్రహ్మండ పురాణాల్లోనూ, భారత రామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న వాటినే ప్రబంధంగా మలిచాడు. ఆయన కుమార సంభవంలో ‘దేశి-మార్గములను దేశీయములుగా చేయవలను’ అని పేర్కొన్నాడు. అందులోని గజానన వృత్తాంతం నన్నెచోడుని దేశీయ అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆయన తన కావ్యం రత్నపుత్రిక వంటిదని కొనియాడాడు. అలాంటి కృతులు రచించటానికి కవికి అరవైనాలుగు విద్యల్లో నేర్పు ఉండటం అవసరమని ఆనాటి కవుల అభిప్రాయం. కవిత్వం సౌందర్యంగా, సుకుమారంగా, హృదయానికి నచ్చే విధంగా ఉండాలని నన్నెచోడుని అభిప్రాయం. ప్రతి పద్యం విశిష్టంగా ఉండాలని సూచించాడు. సుకవి స్తుతి, కుకవి నింద, ఇష్టదేవప్రార్థన ఇతడి ఇతర రచనలు.
అరవింద్ఘోష్
|

నేల చదరంగా విస్తరించిన కాగితంలా పల్లం వైపు వ్యాపిస్తున్నప్పుడు, అంటే నది నీరు గట్టుకి దగ్గరవుతున్న కొద్దీ ఆ నీటికి ఒత్తిడి, రాపిడి ఏర్పడతాయి. కారణం ఇరువైపులా ఒడ్డు దగ్గర నేల లోతు తక్కువగా ఉండటమే. ఈ ఒత్తిడి, రాపిడి ఒడ్డు దగ్గర ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అక్కడ నీరు వేగంగా ప్రవహించలేదు. అదే నది మధ్య భాగాన ఒత్తిడి, రాపిడి ప్రభావం ఉండదు. అందుకే అక్కడ నీరు వేగంగా ప్రవహించగలుగుతుంది.
మహిళా ఓటుహక్కు.

నీళ్లు నీలంగా ఎందుకు కనిపిస్తాయి?
ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం |

ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశంలో ప్లాసీ యుద్ధం వరకు కేవలం వర్తక సంఘంగా మాత్రమే కొనసాగింది. ఇంగ్లండ్లో తయారయ్యే వస్తువులను, ఖరీదైన లోహాలను తెచ్చి మనదేశంలో అమ్మి ఇక్కడ దొరికే విలువైన వస్తువులను ఇంగ్లండ్కు తీసుకు వెళ్లేది. వాటిని ఇంగ్లండ్తోపాటు యూరప్ దేశాల్లో అధిక ధరలకు అమ్ముకునేది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వస్తువుల తయారీని ప్రోత్సహించింది. కాని బ్రిటిష్ ఉత్పత్తిదారులు దానిని వ్యతిరేకించారు. భారతదేశంలో తయారైన వస్తువులకు ఇంగ్లండ్లో గిరాకీ పెరగడం వారికి కన్నుకుట్టింది. బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశ వస్తువుల దిగుమతులను అరికడుతూ అనేక చట్టాలు ప్రవేశపెట్టినప్పటికీ 18వ శతాబ్ది మధ్య భాగం వరకు భారతదేశ ఉత్పత్తులకు ఇంగ్లండ్లో ఎక్కువ ప్రచారం లభించింది.
బ్రిటిష్ కంపెనీ మనదేశంలో క్రమంగా రాజ్యాక్రమణ మీద ఆసక్తి చూపి తర్వాత రాజకీయ అధికార విస్తరణకు పూనుకోవటంతో వారి వ్యాపారంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశంలోని ఉత్పత్తిదారులు తమ సరుకులను బ్రిటిష్ వర్తకులకే అమ్మాలని కంపెనీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. కంపెనీ ఉద్యోగులు నేత పనివారికి కొంత మొత్తాన్ని ముందుగానే అప్పులుగా ఇచ్చి వారిని పరోక్షంగా బంధించారు. తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి, పోటీ వ్యాపారులను తొలగించ గలిగింది. ఈ చర్యల వల్ల వస్తు ఉత్పత్తిలో అభివృద్ధి సాధించకపోగా, దేశీయ ఆదాయం, ఆర్థిక ప్రగతి కృంగిపోయాయి.
18వ శతాబ్దపు మధ్యభాగంలో ఇంగ్లండ్లో సంభవించిన పారిశ్రామిక విప్లవం, కొత్త రకమైన ఉత్పత్తిదారుల విజృంభణకు దారి తీసింది. భారత దేశంలోని వ్యాపారంపై కంపెనీ గుత్తాధిపత్యం వారికి నచ్చలేదు.1813లో చార్టర్ చట్టం అప్పటి వరకు భారత్ వ్యాపారంపై ఆ కంపెనీకి ఉన్న గుత్తాధికారానికి ముగింపు పలికింది. భారతదేశంలో వ్యాపారం చేయటానికి బ్రిటిష్ పౌరులకు అవకాశం దొరికింది. భారతదేశం ఇంగ్లండ్ అధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి భారత దేశాన్ని ఇంగ్లండ్కు ఆర్థికవలస దేశంగా పరిగణించారు. భారతదేశ ఆర్థిక విధానం బ్రిటిష్ వారి అవసరాలకు అనుగుణంగా మార్చబడింది. ఈ కారణంగా దేశంలోని భారీ పరిశ్రమలే కాక, చేతిపనులు, గ్రామీణ పరిశ్రమలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
బ్రిటిష్ కంపెనీ మనదేశంలో క్రమంగా రాజ్యాక్రమణ మీద ఆసక్తి చూపి తర్వాత రాజకీయ అధికార విస్తరణకు పూనుకోవటంతో వారి వ్యాపారంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశంలోని ఉత్పత్తిదారులు తమ సరుకులను బ్రిటిష్ వర్తకులకే అమ్మాలని కంపెనీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. కంపెనీ ఉద్యోగులు నేత పనివారికి కొంత మొత్తాన్ని ముందుగానే అప్పులుగా ఇచ్చి వారిని పరోక్షంగా బంధించారు. తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి, పోటీ వ్యాపారులను తొలగించ గలిగింది. ఈ చర్యల వల్ల వస్తు ఉత్పత్తిలో అభివృద్ధి సాధించకపోగా, దేశీయ ఆదాయం, ఆర్థిక ప్రగతి కృంగిపోయాయి.
18వ శతాబ్దపు మధ్యభాగంలో ఇంగ్లండ్లో సంభవించిన పారిశ్రామిక విప్లవం, కొత్త రకమైన ఉత్పత్తిదారుల విజృంభణకు దారి తీసింది. భారత దేశంలోని వ్యాపారంపై కంపెనీ గుత్తాధిపత్యం వారికి నచ్చలేదు.1813లో చార్టర్ చట్టం అప్పటి వరకు భారత్ వ్యాపారంపై ఆ కంపెనీకి ఉన్న గుత్తాధికారానికి ముగింపు పలికింది. భారతదేశంలో వ్యాపారం చేయటానికి బ్రిటిష్ పౌరులకు అవకాశం దొరికింది. భారతదేశం ఇంగ్లండ్ అధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి భారత దేశాన్ని ఇంగ్లండ్కు ఆర్థికవలస దేశంగా పరిగణించారు. భారతదేశ ఆర్థిక విధానం బ్రిటిష్ వారి అవసరాలకు అనుగుణంగా మార్చబడింది. ఈ కారణంగా దేశంలోని భారీ పరిశ్రమలే కాక, చేతిపనులు, గ్రామీణ పరిశ్రమలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
తుపాను ఎలా వస్తుంది?
పెనుగాలి, దానితో పాటు కుంభవృష్టి... ఒకచోట నుంచి మరో చోటికి వేగంగా కదిలిపోతుంటుంది. దీన్నే తుపాన్ అంటాం. భూమధ్యరేఖాప్రాంతాల నుంచి తేమగా ఉండే వేడిగాలి బయలు దేరి, ఉత్తరార్ధగోళ ప్రాంతాల్లో పొడిగా ఉండే గాలిని కలిసినప్పుడు తుపాను మొదలవుతుంది. నిజానికి ఈ రెండు గాలులూ కలగలిసిపోవు. ఈ రెండు రకాల గాలులు ఉద్ధృతంగా కలిసేచోట వేడిగాలి చల్లగాలి కంటే పైకి ఎగసి చల్లబడిపోతుంది.
అప్పుడు గాలిలోని తేమదనం చిక్కబడి మేఘాలు ఏర్పడతాయి. తుపాన్ మధ్య ప్రాంతంలో గాలి ‘పీడనం’ తరిగిపోవడం ఆరంభిస్తుంది. అప్పుడు ‘అల్ప పీడనం’ ఆ ప్రాంతం చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. అదే ఉత్తరార్ధగోళ ప్రాంతంలోనైతే గాలి ‘అపసవ్య’ దిశలో వీస్తుంది. అంటే వేడిగాలి ఉత్తరం వైపున, చల్లని చలిగాలి దక్షిణం వైపున సాగి పశ్చిమ దిశవైపు తిరుగుతుంది. దీన్నే ‘అల్ప పీడనం’ అంటారు. ఈ ‘అల్పపీడన’ ప్రాంతాన్నే మరో మాటలో తుపాన్ అంటాం.
అప్పుడు గాలిలోని తేమదనం చిక్కబడి మేఘాలు ఏర్పడతాయి. తుపాన్ మధ్య ప్రాంతంలో గాలి ‘పీడనం’ తరిగిపోవడం ఆరంభిస్తుంది. అప్పుడు ‘అల్ప పీడనం’ ఆ ప్రాంతం చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. అదే ఉత్తరార్ధగోళ ప్రాంతంలోనైతే గాలి ‘అపసవ్య’ దిశలో వీస్తుంది. అంటే వేడిగాలి ఉత్తరం వైపున, చల్లని చలిగాలి దక్షిణం వైపున సాగి పశ్చిమ దిశవైపు తిరుగుతుంది. దీన్నే ‘అల్ప పీడనం’ అంటారు. ఈ ‘అల్పపీడన’ ప్రాంతాన్నే మరో మాటలో తుపాన్ అంటాం.
అలీఘర్ ఉద్యమం

19వ శతాబ్దంలో ముస్లింలు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత వారు నిరాశ చెందారు. బ్రిటిష్ ప్రభుత్వం 1857 తిరుగుబాటును అణచి వేసిన తర్వాత ఆ తిరుగు బాటుకు ముస్లింలే కారణం అనే భావనతో ముస్లిం వ్యతిరేక విధానాల్ని అవలం బించింది. దాంతో ముస్లింలలో బ్రిటిష్ వారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది, వారు పాశ్చాత్య విద్యను వ్యతిరేకించారు. అయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేసిన కృషి వలన వారిలో చైతన్యం పెరిగింది. అలీఘర్ ఉద్యమ స్థాపకుడే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆయన 1876లో మహ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. హైదరాబాద్ ప్రధానిమంత్రి సాలార్జంగ్ ప్రోత్సాహంతో దీనిని ముస్లింల కేంద్ర విద్యాసంస్థగా రూపొందించారు.
మహ్మదీయుల్లో రాజకీయ చైతన్యం పెంచటం, ఆధునిక విద్యను ప్రచారం చేయటం అలీఘర్ ఉద్యమ ముఖ్య ఆశయాలు. బ్రిటిష్ అధికారులు ఈ ఉద్యమాన్ని సమర్థించారు. దీని వలన దేశంలోని ముస్లిం మధ్య సమైఖ్యత పెరిగింది.
ఇస్లాం మతం పట్ల విధేయత తగ్గకుండా పాశ్చాత్య విద్యను ప్రచారం చేయటం ఈ ఉద్యమం లక్ష్యం. ఈ ఉద్యమం బహు భార్యత్వాన్ని, ఘోషా పద్ధతిని ఖండించింది. స్ర్తీ విద్యను ప్రోత్సహించింది. ఉద్యమాన్ని ప్రారంభించిన సర్ సయ్యద్ అహ్మద్ భారతదేశంలోని హిందువులు, ముస్లింలు ఒకటే అని నమ్మారు. పరమతసహనం మంచిదని ప్రచారం చేశాడు. మత ఘర్షణలు వ్యతిరేకించాడు. అహ్మద్ ఖాన్ ఉదార వాది, అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అంగీకరిస్తే అధికారం హిందువులకే లభిస్తుందని భావించాడు. దాంతో మతతత్వ వాదిగా మారాడు.
మహ్మదీయుల్లో రాజకీయ చైతన్యం పెంచటం, ఆధునిక విద్యను ప్రచారం చేయటం అలీఘర్ ఉద్యమ ముఖ్య ఆశయాలు. బ్రిటిష్ అధికారులు ఈ ఉద్యమాన్ని సమర్థించారు. దీని వలన దేశంలోని ముస్లిం మధ్య సమైఖ్యత పెరిగింది.
ఇస్లాం మతం పట్ల విధేయత తగ్గకుండా పాశ్చాత్య విద్యను ప్రచారం చేయటం ఈ ఉద్యమం లక్ష్యం. ఈ ఉద్యమం బహు భార్యత్వాన్ని, ఘోషా పద్ధతిని ఖండించింది. స్ర్తీ విద్యను ప్రోత్సహించింది. ఉద్యమాన్ని ప్రారంభించిన సర్ సయ్యద్ అహ్మద్ భారతదేశంలోని హిందువులు, ముస్లింలు ఒకటే అని నమ్మారు. పరమతసహనం మంచిదని ప్రచారం చేశాడు. మత ఘర్షణలు వ్యతిరేకించాడు. అహ్మద్ ఖాన్ ఉదార వాది, అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అంగీకరిస్తే అధికారం హిందువులకే లభిస్తుందని భావించాడు. దాంతో మతతత్వ వాదిగా మారాడు.
‘యురేనియం’ అంటే ఏమిటి?
మనకు బాంబుల గురించి, వాటికి అవసరమైన లోహాల గురించి ప్రసక్తి వచ్చినప్పుడల్లా‘ యురేనియం’ పేరు వినబడుతుంది. అసలు యురేనియం అంటే ఏమిటి? అనే విషయం తెలుసుకుందాం.
యురేనియం అంటే ధార్మికశక్తి అధికంగా ఉంటే మూలకం. రసాయనికపరంగా వ్యవహరించేటప్పుడు దీనికి ’్ఖ’ అనే చిహ్నం వాడతారు. యురేనియంలో అధిక భాగం వెండిరంగులో ఉండే అనేక పసుపురంగులోని ఛాయలు మెరుస్తాయి. అయితే యురేనియం అంత ఎక్కువగా దొరకదు. కానీ ఖనిజాల కోసం భూమిని తొలిచి వెదుకుతున్న సమయంలో యురేనియం నిల్వల సంగతి సులభంగా తెలిసిపోతుంది. కారణం యురేనియం ధార్మిక శక్తి ప్రభావం ఆ ఖనిజపు నిల్వలు ఉన్నచోట స్పష్టంగా వ్యక్తమవుతుంది. సాంకే తిక పరికరాలకు ఈ ప్రభావం అందుతుంది. యురేనియంలోని అణువులు ఇతర లోహాల అణువుల కన్నా బరువుగా ఉంటాయి.
యురేనియం ఐసోటోప్లలోని అణువులను రెండు భాగాలుగా విడదీయవచ్చు. దీనివల్ల విపరీతమైన శక్తి విడుదలవుతుంది. అణు బాంబుల తయారీకి శుద్ధిచేసిన యురేనియాన్ని వాడతారు. అణు రియాక్టర్ల లో విద్యుదుత్పాదనకూ వాడతారు. యురేనియం నుంచి ప్లుటోనియాన్ని కూడా రాబట్టవచ్చు.

యురేనియం ఐసోటోప్లలోని అణువులను రెండు భాగాలుగా విడదీయవచ్చు. దీనివల్ల విపరీతమైన శక్తి విడుదలవుతుంది. అణు బాంబుల తయారీకి శుద్ధిచేసిన యురేనియాన్ని వాడతారు. అణు రియాక్టర్ల లో విద్యుదుత్పాదనకూ వాడతారు. యురేనియం నుంచి ప్లుటోనియాన్ని కూడా రాబట్టవచ్చు.
వీనస్ మీద గాలి ఉంటుందా?
రక్షక కవాట సిద్ధాంతం |

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం ప్రజల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాల్ని అదుపు చేయవలసి వచ్చింది. అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కాకుండా వారి అదుపాజ్ఞల్లో ఉండే విధంగా ఒక కార్యాచరణను రూపొందించారు. అలా తయారయినదే జాతీయ కాంగ్రెస్... అనే వాదనలు ఉన్నాయి. ఈ వ్యవహారం రక్షక కవాట (ట్చజ్ఛ్టడ ఠ్చిఠ్ఛి ్టజిౌ్ఛటడ) సిద్ధాంతం ఆవిర్భావానికి దారి తీసిందని చెప్పవచ్చు. భారతీయులు స్వాతంత్య్రం కోసం విప్లవ మార్గంలో పయనించకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ని ఏర్పాటుచేశారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలాలజపతిరాయ్ అభిప్రాయం ప్రకారం ‘‘బ్రిటిష్ రాజ ప్రతినిధి లార్డ్ ఢప్రిన్ ఆలోచనల మేరకు భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించేందుకు జాతీయకాంగ్రెస్ను స్థాపించారు. బ్రిటిష్ పాలనకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉందని, లభించిన ఆధారాలను ప్రాతిపదికగా చేసుకుని ఎఓ హ్యూమ్ ఒక రక్షక కవాటం సృష్టించాలని నిర్ణయించుకున్నాడు’’ అని లాలాలజపతి రాయ్ అభిప్రాయపడ్డాడు. జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడు డబ్ల్యూ సి బెనర్జీ కూడా ‘‘కాంగ్రెస్ ఢప్రిన్ ప్రభువు సృష్టి’’ అని పేర్కొన్నాడు.
ఢప్రిన్ సలహా తీసుకొని ఎఓ హ్యూమ్ మరి కొంతమంది ఆంగ్లేయ అధికారులు జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు. రజనీ పామీదత్ అనే జర్నలిస్ట్ ‘‘రాజ ప్రతినిధి ఢప్రిన్తో చే సుకున్న రహస్య ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్ అవిర్భవించింది’’ అని వ్యాఖ్యానించాడు. రాష్ట్రీయ సేవక్ సమాజ్ నాయకుడైన ఎమ్మెస్ గోల్వాల్కర్ అభిప్రాయం ప్రకారం బ్రిటిష్ వారు కాంగ్రెస్ను ఒక రక్షక కవాటంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నారు.
వారి ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో ప్రజ్వరిల్లుతున్న జాతీయత భావాల్ని అదుపులో ఉంచటం, జాతీయ దృక్పథాలను నాశనం చేయటం. అయితే ఆచార్య బిపిన్చంద్ర మాత్రం రక్షక కవాట సిద్ధాంతాన్ని కొట్టి పారేశాడు. ఒక సంస్థను నెలకొల్పి రాజకీయ విషయాలు చర్చిస్తే దేశంలోని ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటానికి వీలుపడుతుందని హ్యూమ్ అలా చేశాడని ఆయన వాదించాడు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలాలజపతిరాయ్ అభిప్రాయం ప్రకారం ‘‘బ్రిటిష్ రాజ ప్రతినిధి లార్డ్ ఢప్రిన్ ఆలోచనల మేరకు భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించేందుకు జాతీయకాంగ్రెస్ను స్థాపించారు. బ్రిటిష్ పాలనకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉందని, లభించిన ఆధారాలను ప్రాతిపదికగా చేసుకుని ఎఓ హ్యూమ్ ఒక రక్షక కవాటం సృష్టించాలని నిర్ణయించుకున్నాడు’’ అని లాలాలజపతి రాయ్ అభిప్రాయపడ్డాడు. జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడు డబ్ల్యూ సి బెనర్జీ కూడా ‘‘కాంగ్రెస్ ఢప్రిన్ ప్రభువు సృష్టి’’ అని పేర్కొన్నాడు.
ఢప్రిన్ సలహా తీసుకొని ఎఓ హ్యూమ్ మరి కొంతమంది ఆంగ్లేయ అధికారులు జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు. రజనీ పామీదత్ అనే జర్నలిస్ట్ ‘‘రాజ ప్రతినిధి ఢప్రిన్తో చే సుకున్న రహస్య ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్ అవిర్భవించింది’’ అని వ్యాఖ్యానించాడు. రాష్ట్రీయ సేవక్ సమాజ్ నాయకుడైన ఎమ్మెస్ గోల్వాల్కర్ అభిప్రాయం ప్రకారం బ్రిటిష్ వారు కాంగ్రెస్ను ఒక రక్షక కవాటంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నారు.
వారి ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో ప్రజ్వరిల్లుతున్న జాతీయత భావాల్ని అదుపులో ఉంచటం, జాతీయ దృక్పథాలను నాశనం చేయటం. అయితే ఆచార్య బిపిన్చంద్ర మాత్రం రక్షక కవాట సిద్ధాంతాన్ని కొట్టి పారేశాడు. ఒక సంస్థను నెలకొల్పి రాజకీయ విషయాలు చర్చిస్తే దేశంలోని ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటానికి వీలుపడుతుందని హ్యూమ్ అలా చేశాడని ఆయన వాదించాడు.
రాకెట్ వేగంలో తేడా వస్తే?

‘రాకెట్ ప్రయాణించడానికి వేగాన్ని నిర్దేశిస్తారు. దాని ప్రకారమే ప్రయాణించాలి. దాని ప్రకారం బయలుదేరాక అది చంద్రుడి మీద దిగడానికి ఎంత సమయం పడుతుందో లెక్కిస్తారు. దీనికి కచ్చితమైన గణితం ఉంటుంది. కొంత గురి తప్పినా ఏమవుతుంది? విశాలమైన చంద్రగ్రహం మీద మరోచోట దిగుతుంది. గదా? అనడానికి లేదు. రాకెట్ యాత్ర వేగం కచ్చితంగా లేకపోతే లక్ష్యం తప్పే ప్రమాదం ఉంది. ఎందుకంటే విశ్వం చాలా విశాలమైంది. రాకెట్ భూమ్యాకర్షణ నుంచి బయట పడేందుకు గంటకు 42 వేల కి.మీ వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది.
ఆ తరువాత చంద్రుడి మీద దిగేందుకు 1250 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. రాకెట్ వేగం సంగతి అటుంచితే చంద్రుడు కూడా భూమి చుట్టూ గంటకి 3836 కి.మీ. వేగంతో తిరుగుతాడు. కనుక భూమికి, చంద్రుడికీ మధ్య దూరం 52,800 కి.మీ. కాబట్టి రాకెట్ అనుకున్న చోట దిగాలంటే భూమి, చంద్రుడు, రాకెట్ వేగాలను ఖచ్చితంగా తేల్చడానికి నిపుణులు అనుక్షణం కృషి చేయాలి. ఆపై చంద్రగ్రహ ఆకర్షణ శక్తికి తగిన వేగాన్ని చంద్రుడికి 3వేల కి.మీ. దూరం నుంచే మార్చవలసి ఉంటుంది. రాకెట్ ప్రయాణ వేగంలో రెండు కి.మీ తేడా వచ్చినా, ప్రయాణ దిశ ఒక్క‘డిగ్రీ’ మారినా రాకెట్ చంద్రగ్రహం మీద దిగడంలో ఏడు గంటల తేడా రావచ్చు. కొన్నిసార్లు చంద్రుడి పై దిగకుండా పూర్తిగా తప్పిపోవడం కూడా జరగవచ్చు.
ఆ తరువాత చంద్రుడి మీద దిగేందుకు 1250 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. రాకెట్ వేగం సంగతి అటుంచితే చంద్రుడు కూడా భూమి చుట్టూ గంటకి 3836 కి.మీ. వేగంతో తిరుగుతాడు. కనుక భూమికి, చంద్రుడికీ మధ్య దూరం 52,800 కి.మీ. కాబట్టి రాకెట్ అనుకున్న చోట దిగాలంటే భూమి, చంద్రుడు, రాకెట్ వేగాలను ఖచ్చితంగా తేల్చడానికి నిపుణులు అనుక్షణం కృషి చేయాలి. ఆపై చంద్రగ్రహ ఆకర్షణ శక్తికి తగిన వేగాన్ని చంద్రుడికి 3వేల కి.మీ. దూరం నుంచే మార్చవలసి ఉంటుంది. రాకెట్ ప్రయాణ వేగంలో రెండు కి.మీ తేడా వచ్చినా, ప్రయాణ దిశ ఒక్క‘డిగ్రీ’ మారినా రాకెట్ చంద్రగ్రహం మీద దిగడంలో ఏడు గంటల తేడా రావచ్చు. కొన్నిసార్లు చంద్రుడి పై దిగకుండా పూర్తిగా తప్పిపోవడం కూడా జరగవచ్చు.
ఫొటో ఫిల్మ్ ఎలా తయారుచేస్తారు?

ఫోటోలు తియ్యడానికి, సినిమా నిర్మించడానికి ఫిలిమ్ని వాడుతుంటారని తెలుసు కదా! కెమెరా డబ్బాలో ముఖ్యమైనది ఫిలిమ్. మొదట అది ఒక రకంగా కాగితం. దాని మీద రసాయనాల లేపనం ఉంటుంది. సిల్వర్ కాంపౌండ్ వంటి లేపనాల వల్ల వెలుతురు పడితే వెలుగు నీడలుగా విడదీసి హత్తుకుంటుంది.
ఫిలిమ్ మీద ఉండే ఈ పూతను ‘లైట్ సెన్సిటివ్’ పదార్థాలంటారు. చక్కని దృశ్యం కాని, చెత్త సినిమా బొమ్మ కాని తీసిన తర్వాత ఈ ఫిలిమ్ను మరికొన్ని రసాయనాల్లో కడగడం వలన ‘డెవలపింగ్’, ‘ ఫిక్సింగ్’ పూర్తయి నెగెటివ్లో తెల్లని భాగాలు నల్లగా,నల్లనిఆకృతులు తెల్లగా ముద్రపడతాయి. దీని మీద నుంచి పడే కాంతి ఫోటో సెన్సిటివ్ లేపనాలు గల కాగితం మీద పడి వెలుగు నీడలు సక్రమంగా అవుతాయి. డెవలపింగ్, ఫిక్సింగ్, ప్రింటింగ్ లను ‘‘ప్రోసెసింగ్’’ అంటారు. అంటే ఆ ప్రక్రియలన్నీ పూర్తయితేనే ఫోటో పూర్తి ఆకారంతో సిద్ధం అవుతుందన్నమాట.
ఫిలిమ్ మీద ఉండే ఈ పూతను ‘లైట్ సెన్సిటివ్’ పదార్థాలంటారు. చక్కని దృశ్యం కాని, చెత్త సినిమా బొమ్మ కాని తీసిన తర్వాత ఈ ఫిలిమ్ను మరికొన్ని రసాయనాల్లో కడగడం వలన ‘డెవలపింగ్’, ‘ ఫిక్సింగ్’ పూర్తయి నెగెటివ్లో తెల్లని భాగాలు నల్లగా,నల్లనిఆకృతులు తెల్లగా ముద్రపడతాయి. దీని మీద నుంచి పడే కాంతి ఫోటో సెన్సిటివ్ లేపనాలు గల కాగితం మీద పడి వెలుగు నీడలు సక్రమంగా అవుతాయి. డెవలపింగ్, ఫిక్సింగ్, ప్రింటింగ్ లను ‘‘ప్రోసెసింగ్’’ అంటారు. అంటే ఆ ప్రక్రియలన్నీ పూర్తయితేనే ఫోటో పూర్తి ఆకారంతో సిద్ధం అవుతుందన్నమాట.
యుద్ధం పట్ల జాతీయ వాదుల వైఖరి

1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారు భారత జాతీయవాదులు. భారతీయల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన విశ్వాసానికి కాంగ్రెస్ రాజకీయ సంస్కరణలు చేపట్టాలని కోరింది. తిలక్ జైలు నుంచి విడుదల కాగానే జాతీయ ఉద్యమానికి గొప్ప నాయకుడిగా ప్రశంసలను అందుకున్నాడు. జాతీయ వాద వర్గాలు తిలక్కు వీరోచిత స్వాగతం పలికాయి. తిలక్ కూడా ప్రభుత్వ కృషికి మద్దతునివ్వటానికి నిశ్చయించాడు.
‘‘ఇలాంటి క్లిష్ట సమయంలో పెద్ద-చిన్న, ధనిక-పేద అన్న తేడా లేకుండా ప్రతి భారతీయుడూ బ్రిటిష్ ప్రభుత్వానికి శక్తి కొలది మద్దతునిచ్చి సహాయం చెయ్యాలి’’ అని తిలక్ ప్రకటించాడు. సుహృద్భావంతో స్వరాజ్ను సాధించ వచ్చనుకున్న జాతీయవాదులు భారతీయులను సైనికదళంలో చేరవల్సిందిగా కోరారు. టర్కీ పట్ల బ్రిటిష్ ప్రభుత్వం వైఖరిని ముస్లిమ్లు నిరసించినా, ముస్లిం సైనికులు టర్కీ సైనికులతో మొసపొటేమియాలో వీరోచితంగా పోరాడారు.
తిలక్ ప్రతిష్ఠ తారాపథాన్నందుకుంది. ఆయన భారతేశం రాజకీయాలను చైతన్యవంతం చేశాడు. తిలక్ రాక, జాతీయాభిమానికి ఊపునిచ్చింది. కానీ అప్పటికి జాతీయ కాంగ్రెస్ మితవాదుల చేతుల్లో ఉంది.1914లో అనిబిసెంట్ భారత స్వాతంత్య్రోమానికి మద్దతు నిచ్చింది. మొదట్లో అనిబిసెంట్ కాంగ్రెస్ లోని రెండు వర్గాలను ఏకం చేయటానికి ప్రయత్నం చేసింది. కాని ఆమె కృషి విఫలమైంది.
చాలా మంది కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య సమైక్యతను సాధించటానికి ప్రయత్నించారు. చాలామంది కాంగ్రెస్ వాదులు తిలక్తో రాజీ ప్రయత్నాలు చేశారు. గోఖలే, ఫిరోజ్షా మెహతాలు మరణించడంతో మిత వాద వార్గానికి నాయకుడు లేకుండా పోయాడు. ఇదే సమయంలో తిలక్ లక్నో కాంగ్రెస్ని ప్రభావితం చేశాడు. అప్పటి నుంచి తిలక్ కాంగ్రెస్లో మకుటం లేని మహారాజు అయ్యాడు. కాంగ్రెస్ పునర్వికాసాన్ని పొందింది.
‘‘ఇలాంటి క్లిష్ట సమయంలో పెద్ద-చిన్న, ధనిక-పేద అన్న తేడా లేకుండా ప్రతి భారతీయుడూ బ్రిటిష్ ప్రభుత్వానికి శక్తి కొలది మద్దతునిచ్చి సహాయం చెయ్యాలి’’ అని తిలక్ ప్రకటించాడు. సుహృద్భావంతో స్వరాజ్ను సాధించ వచ్చనుకున్న జాతీయవాదులు భారతీయులను సైనికదళంలో చేరవల్సిందిగా కోరారు. టర్కీ పట్ల బ్రిటిష్ ప్రభుత్వం వైఖరిని ముస్లిమ్లు నిరసించినా, ముస్లిం సైనికులు టర్కీ సైనికులతో మొసపొటేమియాలో వీరోచితంగా పోరాడారు.
తిలక్ ప్రతిష్ఠ తారాపథాన్నందుకుంది. ఆయన భారతేశం రాజకీయాలను చైతన్యవంతం చేశాడు. తిలక్ రాక, జాతీయాభిమానికి ఊపునిచ్చింది. కానీ అప్పటికి జాతీయ కాంగ్రెస్ మితవాదుల చేతుల్లో ఉంది.1914లో అనిబిసెంట్ భారత స్వాతంత్య్రోమానికి మద్దతు నిచ్చింది. మొదట్లో అనిబిసెంట్ కాంగ్రెస్ లోని రెండు వర్గాలను ఏకం చేయటానికి ప్రయత్నం చేసింది. కాని ఆమె కృషి విఫలమైంది.
చాలా మంది కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య సమైక్యతను సాధించటానికి ప్రయత్నించారు. చాలామంది కాంగ్రెస్ వాదులు తిలక్తో రాజీ ప్రయత్నాలు చేశారు. గోఖలే, ఫిరోజ్షా మెహతాలు మరణించడంతో మిత వాద వార్గానికి నాయకుడు లేకుండా పోయాడు. ఇదే సమయంలో తిలక్ లక్నో కాంగ్రెస్ని ప్రభావితం చేశాడు. అప్పటి నుంచి తిలక్ కాంగ్రెస్లో మకుటం లేని మహారాజు అయ్యాడు. కాంగ్రెస్ పునర్వికాసాన్ని పొందింది.
ప్లూటో... గ్రహం కాదా?

సౌరకుటుంబంలో మెర్క్యురీ (బుధుడు), వీనస్ (శుక్రుడు), భూమి (ఎర్త్), మార్స్ (అంగారకుడు), జూపిటర్ (గురుడు లేదా బృహస్పతి), సాటర్న్ (శని), యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే తొమ్మిది గ్రహాలు ఉంటాయని గతంలో చదువుకున్నాం. వాటిలో ప్లూటో అన్నింటికన్నా చిన్న గ్రహం. చాలా దూరంగా ఉంటుంది. 1930 ఫిబ్రవరి 18న ‘క్లైడ్ టైమ్ బా’ అనే ఖగోళ శాస్తజ్ఞ్రుడు ప్లూటోను కనుగొన్నాడు. 76 సంవత్సరాల పాటు ఇది గ్రహం హోదాలో ఉంది. కాని తర్వాత నుంచి ఫ్లూటోని గ్రహంగా గుర్తించట్లేదు.
2006లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సదస్సులో ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వారు 2006 ఆగస్టు 24న గ్రహానికి ఒక నిర్వచనాన్ని రూపొందించారు. ప్లూటో ఆ నిర్వచనం పరిధిలోకి రాక పోవడంతో దానిని అప్పటి నుంచి డ్వార్ఫ్ ప్లానెట్ (మరుగుజ్జు గ్రహం) గా గుర్తిస్తున్నారు. సౌర వ్యవస్థలో ఏరిస్ తరవాత ప్లూటోనే అత్యంత పెద్ద డ్వార్ఫ్ ప్లానెట్ అని ఖగోళ శాస్తజ్ఞ్రులు ప్రకటించారు. ఫ్లూటో సూర్యునికి చాలా దూరంగా ఉండడమే కాకుండా అతి చల్లగా ఉంటుంది. దాని మీద ఉష్ణోగ్రత మైనస్ 235 నుంచి మైనస్ 210 డిగ్రీ సెల్సియస్ల వరకు ఉంటుంది.ప్లూటో మీద ఉండే వాతావరణంలో నైట్రోజన్, కొద్దిగా కార్బన్ మోనాక్సైడ్, మిథేన్ వాయువులు ఉన్నాయి.
2006లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సదస్సులో ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వారు 2006 ఆగస్టు 24న గ్రహానికి ఒక నిర్వచనాన్ని రూపొందించారు. ప్లూటో ఆ నిర్వచనం పరిధిలోకి రాక పోవడంతో దానిని అప్పటి నుంచి డ్వార్ఫ్ ప్లానెట్ (మరుగుజ్జు గ్రహం) గా గుర్తిస్తున్నారు. సౌర వ్యవస్థలో ఏరిస్ తరవాత ప్లూటోనే అత్యంత పెద్ద డ్వార్ఫ్ ప్లానెట్ అని ఖగోళ శాస్తజ్ఞ్రులు ప్రకటించారు. ఫ్లూటో సూర్యునికి చాలా దూరంగా ఉండడమే కాకుండా అతి చల్లగా ఉంటుంది. దాని మీద ఉష్ణోగ్రత మైనస్ 235 నుంచి మైనస్ 210 డిగ్రీ సెల్సియస్ల వరకు ఉంటుంది.ప్లూటో మీద ఉండే వాతావరణంలో నైట్రోజన్, కొద్దిగా కార్బన్ మోనాక్సైడ్, మిథేన్ వాయువులు ఉన్నాయి.
కుషాణుల సామ్రాజ్యం

కుషాణుల పరిపాలన క్రీ.శ. 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు సాగింది. కుషాణులలో కనిష్కుడు గొప్పరాజుగా ప్రసిద్ధి చెందాడు. కుషాణుల పరిపాలన ప్రారంభమైన మొదటికాలంలో లభించిన కొన్ని చిహ్నాల పై పురాతన ఆలయాల బొమ్మలున్నాయి. వీటిలో వారు నిర్మించిన కోటలు, గురప్రుస్వారీ చేసిన వారి శిల్పా లున్నాయి. పుర్రె, అవిటితనం కలిగిన రాజు బొమ్మలు కూడా ఉన్నాయి. వీటికి అర్థం, కారణం తెలియక పోయినప్పటికీ ఎందుకు చిత్రించారా అన్న ఆసక్తిని రేకెత్తించేటట్లు ఉన్నాయి. కుషాణులు చైనాలోని గిరిజన తెగలకు చెందిన వారు. ఆ తెగల్లో పరస్పరం ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉండేది.వీరు చైనాలోని గన్సూ ప్రాంతంలో నివసించేవారు. వీరు మాట్లాడేది తొచారియన్ భాష కావచ్చని చరిత్రకారుల అభిప్రాయం. పరస్పర దాడుల కారణంగా ఈ చైనా గిరిజన జాతులు తలా ఒక వైపుకు విస్తరించారు. జొయాగ్ను దాడుల వలన ఈ జాతుల వారు మరింత పడమర దిక్కుకు వె ళ్లి ఉంటారని భావిస్తున్నారు.
అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులలో ప్రజలు ఇతర ప్రాంతాల్లో స్థిర పడ్డారు. అందులో భాగంగానే కుషాణులు మన దేశంలోకి వచ్చి ఉంటారని జాన్కీయ్ అనే చరిత్రకారుడు భావించాడు. సుమారు క్రీ.శ. 250 నాటికి కుషాణుల సామ్రాజ్యం ప్రస్తుత తజికిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ ప్రాంతాల నుంచి భారతదేశంలోని గంగానది పరీవాహక ప్రాంతమంతా విస్తరించింది. కుషాణులకు రోమన్ సామ్రాజ్యంతోనూ, పర్షియా, చైనాలతోనూ రాజకీయ సంబంధాలు ఉండేవి. తూర్పు, పశ్చిమ భూముల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ మేళవింపులకు కుషాన్ సామ్రాజ్యం ఒక ముఖ్యమైన కేంద్రం అయింది. కుషాణుల్లో చివరిరాజు మొదటి వాసుదేవుడు. ఇతడు క్రీ.శ. 225లో మరణించాడు. ఆ తర్వాత కుషాణుల రాజ్యం విచ్ఛిన్నమైంది.
అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులలో ప్రజలు ఇతర ప్రాంతాల్లో స్థిర పడ్డారు. అందులో భాగంగానే కుషాణులు మన దేశంలోకి వచ్చి ఉంటారని జాన్కీయ్ అనే చరిత్రకారుడు భావించాడు. సుమారు క్రీ.శ. 250 నాటికి కుషాణుల సామ్రాజ్యం ప్రస్తుత తజికిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ ప్రాంతాల నుంచి భారతదేశంలోని గంగానది పరీవాహక ప్రాంతమంతా విస్తరించింది. కుషాణులకు రోమన్ సామ్రాజ్యంతోనూ, పర్షియా, చైనాలతోనూ రాజకీయ సంబంధాలు ఉండేవి. తూర్పు, పశ్చిమ భూముల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ మేళవింపులకు కుషాన్ సామ్రాజ్యం ఒక ముఖ్యమైన కేంద్రం అయింది. కుషాణుల్లో చివరిరాజు మొదటి వాసుదేవుడు. ఇతడు క్రీ.శ. 225లో మరణించాడు. ఆ తర్వాత కుషాణుల రాజ్యం విచ్ఛిన్నమైంది.
భూమి కూడా అంతరిస్తుందా?

యుద్ధ అణ్వస్త్ర ప్రయోగాల వలన, పర్యావరణ నిర్లక్ష్యం వలన, నీరు, చెట్లు లేకపోవటం వలన కూడా భూమి మీద మానవాళి నశించే అవకాశం లేకపోలేదు. అయితే సహజంగా భూమి ఎప్పుడు, ఎలా అంతరిస్తుంది?
సౌరకుటుంబంలోని గ్రహాలన్నీ సూర్యుడి మీద ఆధారపడి నడుస్తుంటాయి. మరి సూర్యుడిలో అంత మంట ఎక్కడిది? ైెహడ్రోజన్ గ్యాస్ హీలియంగా మారుతూ విపరీతమైన వేడిమి, మంటలు, వెలుగు, శక్తి అపరిమితంగా విడుదలవుతుంటాయి. కొంతకాలానికి హైడ్రోజన్ అయిపోతే... అంటే ఇంధనం అయిపోతే సూర్యుడు బద్దలవుతాడు. ఆ ప్రభావానికి భూమి, సమీప గ్రహాలు బద్దలై ధ్వంసమైపోతాయి. అయితే ఈ పరిమాణం 5000 మిలియన్ సంవత్సరాల తరువాత జరగవచ్చని భావిస్తున్నారు.
సౌరకుటుంబంలోని గ్రహాలన్నీ సూర్యుడి మీద ఆధారపడి నడుస్తుంటాయి. మరి సూర్యుడిలో అంత మంట ఎక్కడిది? ైెహడ్రోజన్ గ్యాస్ హీలియంగా మారుతూ విపరీతమైన వేడిమి, మంటలు, వెలుగు, శక్తి అపరిమితంగా విడుదలవుతుంటాయి. కొంతకాలానికి హైడ్రోజన్ అయిపోతే... అంటే ఇంధనం అయిపోతే సూర్యుడు బద్దలవుతాడు. ఆ ప్రభావానికి భూమి, సమీప గ్రహాలు బద్దలై ధ్వంసమైపోతాయి. అయితే ఈ పరిమాణం 5000 మిలియన్ సంవత్సరాల తరువాత జరగవచ్చని భావిస్తున్నారు.
అంతరిక్షంలో ఎలా నడుస్తారు?

రాకెట్ అంతరిక్షంలోకి చేరిన తరువాత వ్యోమగాములు రాకెట్ బయటకు వచ్చి అంతరిక్షంలో దాదాపు నిరాధారంగా నడిచారు. అంతరిక్షంలో గాలితో సహా ఏమీ ఉండని భారరహిత స్థితి మాత్రం ఉంటుంది.
నేల మీద నడిచినట్టు అంతరిక్షంలో నడవలేరు. పోనీ ఒక పద్ధతిగా కావలసిన వైపు నడవడానికి వీలయ్యే ఆకర్షణ స్థితి కూడా ఉండదు. రాకెట్ మాడ్యుల్ కదిలినట్టే తేలిపోతూ కదలవలసిందే! రాకెట్ నుంచి బయటకు వచ్చే ముందు రాకెట్ ఇంజన్కు ఎక్కువ ఒత్తిడి కలిగే ఇంధనాన్ని పంపిస్తారు. దాని ద్వారా రాకెట్లో నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టివేసే మార్గంలో ఒకరకమైన ఒత్తిడి పనిచేస్తుంది. ఇక్కడ కూడా అటు వంటి ఒత్తిడే పని చేస్తుంది. అప్పుడు వ్యోమగాములు రాకెట్కు వ్యతిరేక దిశలో నడవగలుగుతారు.
నేల మీద నడిచినట్టు అంతరిక్షంలో నడవలేరు. పోనీ ఒక పద్ధతిగా కావలసిన వైపు నడవడానికి వీలయ్యే ఆకర్షణ స్థితి కూడా ఉండదు. రాకెట్ మాడ్యుల్ కదిలినట్టే తేలిపోతూ కదలవలసిందే! రాకెట్ నుంచి బయటకు వచ్చే ముందు రాకెట్ ఇంజన్కు ఎక్కువ ఒత్తిడి కలిగే ఇంధనాన్ని పంపిస్తారు. దాని ద్వారా రాకెట్లో నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టివేసే మార్గంలో ఒకరకమైన ఒత్తిడి పనిచేస్తుంది. ఇక్కడ కూడా అటు వంటి ఒత్తిడే పని చేస్తుంది. అప్పుడు వ్యోమగాములు రాకెట్కు వ్యతిరేక దిశలో నడవగలుగుతారు.
సాంఘిక, సాంస్కృతిక విధానాలు... ఈస్టిండియా కంపెనీ

కానీ పారిశ్రామిక విప్లవం, ఆధునిక పెట్టుబడిదారీ విధానం ప్రారంభమైన తర్వాత ఇంగ్లండ్లో కూడా కొత్త ఆలోచనలు వచ్చాయి. సత్యాన్వేషణ, శాస్త్ర విజ్ఞానం తోటి మానవుల పట్ల సానుభూతి మొదలైనవి. ఈ పద్ధతులకు మద్దతునిచ్చిన తీవ్రవాదులు... ఆచరణలో ఉన్న వర్ణ వ్యవస్థ, అంట రానితనం, స్ర్తీలు తక్కువ వారనే భావన మొదలైన సాంఘిక దురాచారాలతో రాజీపడ పడలేదు.
భారతదేశ సాంఘిక జీవనం అటువంటి దురాచారాలను అరికట్టి, ఆధునీకరణ చెందాలని వారు బలంగా భావించారు. క్రైస్తవ మత ప్రచారానికి వచ్చిన మత ప్రచారకులు కూడా అటువంటి ఆధునీకరణ కార్యక్రమాలను కొనసాగించారు.
హిందూ దేశానికి, పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఏర్పడింది. నాటికి ఐరోపాలో మార్టిన్ లూథర్కింగ్, బేకన్ హ్యూమ్ హాబ్స్, బెంథామ్, టామ్పైన్ మొదలై న అనేక మంది సంస్కర్తల ప్రభావానికి భారత సమాజం లోనైంది. ఫ్రెంచి విప్లవ ప్రధాన ఉద్దేశాలు అయిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం తో ప్రభావితమైన కాలమది. విద్యావంతులైన భారతీయు లందరూ ఈ కొత్త ఆశయాలకు, భావాలకు ప్రభావితులయ్యారు. వీరు కొద్దిమందే అయిన ప్పటికీ దేశంలో సాంఘిక, రాజకీయ, మత సంస్కరణ ఉద్యమాలను కొనసాగించారు.
రాక్షసి తంగడి యుద్ధం

ఈ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు ఒక్కసారి ఉత్పన్నమైనవి కావు. సుల్తానులకు, విజయనగర రాజులకు మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. అనేక యుద్ధాలు జరిగేవి. ముఖ్యంగా సంపదతో తులతూగుతుండే కృష్ణ్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న రాయచూరు, అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. 1509 వరకు విజయనగరం మీద లభించిన విజయం... సుల్తానులకు అందని పండే అయింది.

కండరాల నొప్పి ఎందుకు వస్తుంది?

అప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. కాని విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తే కండరాలలో బాధ మొదలవుతుంది. అంటే నడుము లాగడం, కాళ్లు పీకడం లాంటివి. అయితే కండరాలు శ్రమించినపుడు వాటిల్లో లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుందని, దాని వలనే నొప్పులు వస్తాయని భావించేవారు. కానీ అలసిపోయిన కండరాల పరిస్థితి మెరుగు పడేటందుకే లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుందని ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో తెలిసిందట. కండరాల్లో ఉన్న గ్లైకోజన్ నిల్వలను వాడేయడం వలనే కండరాల నొప్పులు వస్తాయని భావిస్తున్నారు. ఏదేమైనా బాగా అలసిపోయినపుడు సరైన విశ్రాంతి తీసుకుంటే కండరాల నొప్పులు చాలావరకు తగ్గిపోతాయనేది వాస్తవం.
ఆత్మగౌరవ ఉద్యమం

తమిళనాడు ప్రాంతంలో అణగారిన సామాజిక వర్గాల అభ్యుదయానికి కృషి చేసిన వ్యక్తి రామస్వామి నాయకర్. ఆయన అక్కడ ఆత్మగౌరవ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన అగ్రవర్గాల ఆధిక్యతను వ్యతిరేకించాడు. ఇతర సామాజిక వర్గాలు కూడా వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ప్రబోధించాడు.
రామస్వామి నాయకర్ 1879 సెప్టెంబర్ 17న ఈరోడ్లో జన్మించాడు. ఆయన అస్పృశ్యతను, సాంఘిక అసమానతలను తీవ్రంగా ఖండించాడు. యుక్తవయసులో మత గ్రంథాలను అధ్యయనం చేస్తూ పండితులతో చర్చలు జరిపేవాడు. హేతువాద దృక్పథాన్ని అలవర్చుకొని నాస్తికుడు అయ్యాడు.
రామస్వామి నాయకర్ ఈరోడ్ పురపాలక సంఘానికి కొంతకాలం అధ్యక్షుడుగా ఉన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడయ్యాడు. అస్పృశ్యులపై విధించిన నిర్బంధాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాడు. ఆ క్రమంలో ఆయన పేరుమోసిన ప్రజా నాయకుడు కావడమే కాక ఉద్యమాలు లేవదీస్తున్నాడన్న ఆరోపణ మీద జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. రామస్వామి జైల్లో ఉండగా ఆయన భార్య నాగమ్మాళ్ స్ర్తీ విముక్తి ఉద్యమాలను నిర్వహించింది.
ఆయన బలహీన సామాజిక వర్గాలకు... ఉద్యోగాలలో, శాసనసభ స్థానాల్లో ప్రత్యేకంగా కేటాయింపు ఉండాలని కోరారు. కాంగ్రెస్లో అగ్రవర్ణాలదే పైచేయి అని రామస్వామి భావించినా, ఆ దృక్పథం పట్ల అసంతృప్తి చెందాడు. కాంగ్రెస్ను అగ్రవర్ణాల కంచుకోటగా వర్ణించి, కాంగ్రెస్ నుంచి బయటకు వ చ్చాడు.
1936లో మదురలో ఇతర సామాజిక వర్గాల సమావేశం జరిగింది. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించాలని, పతనావస్థలో ఉన్న జస్టిస్ పార్టీని పైకి తీసుకు రావాలని నిర్ణయం తీసుకోవడంలో రామస్వామి పాత్ర కీలకం. ఆత్మగౌరవ ఉద్యమం, జస్ట్టిస్ పార్టీ పరస్పరం సహాయం చేసుకున్నాయి. రామస్వామి నాయకర్ జస్టిస్ పార్టీకి గొప్ప నాయకుడు అయ్యాడు.









రామస్వామి నాయకర్ 1879 సెప్టెంబర్ 17న ఈరోడ్లో జన్మించాడు. ఆయన అస్పృశ్యతను, సాంఘిక అసమానతలను తీవ్రంగా ఖండించాడు. యుక్తవయసులో మత గ్రంథాలను అధ్యయనం చేస్తూ పండితులతో చర్చలు జరిపేవాడు. హేతువాద దృక్పథాన్ని అలవర్చుకొని నాస్తికుడు అయ్యాడు.
రామస్వామి నాయకర్ ఈరోడ్ పురపాలక సంఘానికి కొంతకాలం అధ్యక్షుడుగా ఉన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడయ్యాడు. అస్పృశ్యులపై విధించిన నిర్బంధాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాడు. ఆ క్రమంలో ఆయన పేరుమోసిన ప్రజా నాయకుడు కావడమే కాక ఉద్యమాలు లేవదీస్తున్నాడన్న ఆరోపణ మీద జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. రామస్వామి జైల్లో ఉండగా ఆయన భార్య నాగమ్మాళ్ స్ర్తీ విముక్తి ఉద్యమాలను నిర్వహించింది.
ఆయన బలహీన సామాజిక వర్గాలకు... ఉద్యోగాలలో, శాసనసభ స్థానాల్లో ప్రత్యేకంగా కేటాయింపు ఉండాలని కోరారు. కాంగ్రెస్లో అగ్రవర్ణాలదే పైచేయి అని రామస్వామి భావించినా, ఆ దృక్పథం పట్ల అసంతృప్తి చెందాడు. కాంగ్రెస్ను అగ్రవర్ణాల కంచుకోటగా వర్ణించి, కాంగ్రెస్ నుంచి బయటకు వ చ్చాడు.
1936లో మదురలో ఇతర సామాజిక వర్గాల సమావేశం జరిగింది. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించాలని, పతనావస్థలో ఉన్న జస్టిస్ పార్టీని పైకి తీసుకు రావాలని నిర్ణయం తీసుకోవడంలో రామస్వామి పాత్ర కీలకం. ఆత్మగౌరవ ఉద్యమం, జస్ట్టిస్ పార్టీ పరస్పరం సహాయం చేసుకున్నాయి. రామస్వామి నాయకర్ జస్టిస్ పార్టీకి గొప్ప నాయకుడు అయ్యాడు.
|